కరెంటు మీటరా? కారు మోటరా? తేల్చుకోండి
వ్యవసాయ బోర్ల వద్ద కరెంటు మీటరా? 24 గంటల పాటు ఉచిత కరెంటా? ప్రజలే నిర్ణయించుకోవాలని తెరాస సీనియర్ నేత, మంత్రి హరీశ్రావు అన్నారు.
ఎన్నికల ప్రచారంలో హరీశ్రావు
దుబ్బాక: వ్యవసాయ బోర్ల వద్ద కరెంటు మీటరా? 24 గంటల పాటు ఉచిత కరెంటా? ప్రజలే నిర్ణయించుకోవాలని తెరాస సీనియర్ నేత, మంత్రి హరీశ్రావు అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో భాగంగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. రేపటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో ఉదయం నుంచే గ్రామాల్లో ప్రచారం హోరెత్తుతోంది. రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన హరీశ్రావు భాజపాపై మండిపడ్డారు. అసత్యాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ‘‘భాజపాకు ఓటేస్తే ఏమిస్తారట అంటే.. బోర్ల వద్ద మీటర్లు ఇస్తారట.ఏపీ సీఎం జగన్ ఒప్పుకొని బోర్ల వద్ద మీటర్లు పెట్టడం షురూ చేశారు. మన సీఎం కేసీఆర్ మాత్రం నేను పెట్టను.. మాది రైతు ప్రభుత్వం.. పైసలు ఇవ్వకపోయిన ఫర్వాలేదు.. నేను మాత్రం మా బోరువద్ద రైతులకు 24 గంటల కరెంటు ఇస్తానంటున్నారు. ఏ దిక్కున ఉండాలి మనం’’ అని ఓటర్లను ఉద్దేశించి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం