ఆ బిల్లుపై కేంద్రమంత్రే రాజీనామా చేశారు: హరీశ్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 12 Oct 2022 15:58 IST

దుబ్బాక: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు వ్యతిరేక బిల్లులపై ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించారు. కేంద్ర వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక కేంద్రమంత్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఈ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు అన్నారు. కేసీఆర్‌ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం నెల రోజుల్లో అమల్లోకి వస్తుందని, భూ సమస్యలన్నీ పరిష్కరించి కొత్త పాసు పుస్తకాలు అందిస్తామన్నారు. డిజిటల్‌ సర్వే చేయిస్తున్నామన్నారు. ప్రతి ఎకరా, ప్రతి గుంట భూమినీ కొలిచి ఇస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని