‘ఆమె పేరు గుర్తుకురాకే అలా అన్నాను’
ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి తాను వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి కమల్నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని తెలిపారు. అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడం వల్లే ‘ఐటం’ అని అనాల్సి వచ్చిందన్నారు..........
‘ఐటం’ వ్యాఖ్యలపై కమల్నాథ్ వివరణ
దిల్లీ: ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి కమల్నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని తెలిపారు. అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడంతో ‘ఐటం’ అనే పదం వాడాల్సి వచ్చిందన్నారు. ‘‘నేను ఓ మాట అన్నాను. అది ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో వాడలేదు. నాకు ఆ వ్యక్తి పేరు గుర్తుకురాలేదు. ఈ జాబితాలో (చేతిలో ఉన్న ఓ పత్రాన్ని చూపుతూ) ఐటం నెం.1, ఐటం నెం.2 అని ఉంది. అది అవమానించినట్లా?’’ అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేకే భాజపా ఈ అంశంపై వివాదం చేస్తోందని ఆరోపించారు.
ప్రచార పర్వంలో భాగంగా గ్వాలియర్లోని డబ్రా పట్టణంలో కమల్నాథ్ ఆదివారం ప్రసంగిస్తూ.. ‘‘ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ రాజె నిరాడంబర వ్యక్తి. ఆయన ప్రత్యర్థి (భాజపా అభ్యర్థి) గురించి నా కంటే మీకే బాగా తెలుసు. తను ఓ ఐటం’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ రగడ రాజుకుంది. ఆయన తరఫున కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది. కమల్నాథ్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. డబ్రాలో కమలదళం తరఫున ఇమర్తీ దేవి బరిలో ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియాతోపాటు కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆమె కూడా ఒకరు. వారి ఫిరాయింపుతో రాష్ట్రంలో కమల్నాథ్ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్