రాహుల్ అసమర్థుడైన రాకుమారుడు: జేపీ నడ్డా
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అసమర్థుడైన రాకుమారుడని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పీఎం కేర్స్ నిధుల వివరాలు తెలుసుకునేందుకు దాఖలైన సమాచార హక్కు చట్టం....
దిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అసమర్థుడైన రాకుమారుడని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పీఎం కేర్స్ నిధుల వివరాలు తెలుసుకునేందుకు దాఖలైన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తును ప్రధాని కార్యాలయం తిరస్కరించిందని ఒక వార్తా పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తాజాగా రాహుల్ ట్వీట్పై నడ్డా స్పందించారు. ‘‘అసమర్థుడైన రాకుమారుడు పూర్తి వార్తను చదవకుండానే షేర్ చేస్తుంటారు. ఆర్టీఐ పీఎం కేర్స్ గురించి మాత్రమే కాకుండా ఇతర ఆర్టీఐల గురించి తెలుసుకునేందుకు ఆ దరఖాస్తు చేశారు. పారదర్శకతపై మీరు చేసిన దాడి కావడంచేత దానిని తిప్పి పంపండం జరిగింది. ఇది సహజం, ఎందుకంటే మీ కెరీర్ మొత్తం నకిలీ వార్తల వ్యాప్తిపైనే ఆధారపడి ఉంది’’ అని నడ్డా ట్వీట్ చేశారు.
దేశం మొత్తానికి ప్రధానిపై, ఆయన చేపడుతున్న కార్యక్రమాలపైన నమ్మకం ఉందని, పీఎం కేర్స్కు భారీగా విరాళాలు పంపండంతో మరోసారి ఆ నమ్మకం రుజువైందని నడ్డా అన్నారు. దేశం మొత్తం కరోనాపై కలిసికట్టుగా పోరాడుతుంటే, ఓడిపోయిన వ్యక్తులు మాత్రం నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన రాహుల్ను విమర్శించారు. అలానే ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మొత్తం సొమ్మును గాంధీ కుటుంబం తన ట్రస్టులకు తరలించాలని చూసిందని నడ్డా ఆరోపించారు. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందాలు చేసుకున్నారని రాహుల్, సోనియాను ఉద్దేశించి మరోసారి విమర్శలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్