అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే: నాదెండ్ల మనోహర్‌

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు

Published : 21 Oct 2020 01:31 IST

అమరావతి: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడం పూర్తిగా ఏపీ ప్రభుత్వ వైఫల్యమేనని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దసరాకు సొంతూళ్లకు రాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల స్వగ్రామాలకు రావాలనుకునే వారికి నిరాశే మిగిలిందన్నారు. వైద్యానికి హైదరాబాద్‌ వెళ్లాల్సిన పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైల్వే సేవలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదని.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే సంక్రాంతి నాటికీ ఈ సమస్య పరిష్కారం కాదని నాదెండ్ల మనోహన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని