కొవిడ్‌ వల్లే మా ఓటమి: జేడీయూ నేత

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ ఓటమిని అంగీకరించినట్లే కన్పిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను సరళిని చూస్తే.. ఎన్డీయే, మహాకూటమి ఆధిక్యాల్లో పోటాపోటీగా ఉన్నాయి. అయితే పార్టీల

Updated : 10 Nov 2020 10:37 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ ఓటమిని అంగీకరించినట్లే కన్పిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. ఎన్డీయే, మహాకూటమి ఆధిక్యాల్లో పోటాపోటీగా ఉన్నాయి. అయితే పార్టీల వారీగా జేడీయూ ఆధిక్యంలో మూడో స్థానంలో ఉంది. కాగా.. తాజా ఫలితాలపై ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ వల్లే తాము ఓడిపోతున్నామని త్యాగి అన్నారు. 

‘ఏడాది కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ ఫలితాలను బట్టి చూస్తే జేడీయూ, మిత్రపక్షం కలిసి 200లకు పైగా సీట్లలో గెలవాలి. అయితే కొవిడ్‌ 19 ప్రభావం వల్లే మేం ఓడిపోతున్నాం. అంతేగానీ ఆర్జేడీ వల్ల కాదు. ఈ ఏడాదిలో ఆర్జేడీ బ్రాండ్‌ ఏం పెరగలేదు. నితీశ్‌ పేరు ఏం తగ్గలేదు. అయితే ఎన్నికల్లో ప్రజల తీర్పును మేం స్వాగతిస్తున్నాం’ అని త్యాగీ జాతీయ మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే ఒకప్పటి మిత్రపక్షమైన ఎల్జేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. బిహార్‌ రాజకీయాల్లో ఎల్జేపీ ప్రతికూల పాత్ర పోషించిందని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని