యూడీఎఫ్కు బై.. ఎల్డీఎఫ్కు హాయ్..!
ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కేరళలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) చీలిపోయింది. యూడీఎఫ్ నుంచి వైదొలుగుతున్నట్లు కేరళ కాంగ్రెస్ (ఎం) కార్యనిర్వాహక ఛైర్మన్ జోస్ కే మణి
కేరళ అధికార పక్ష కూటమితో కేరళ కాంగ్రెస్ (ఎం) జట్టు
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన పార్టీ ఛైర్మన్ జోస్ కే మణి
తిరువనంతపురం: ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కేరళలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) చీలిపోయింది. యూడీఎఫ్ నుంచి వైదొలుగుతున్నట్లు కేరళ కాంగ్రెస్ (ఎం) కార్యనిర్వాహక ఛైర్మన్ జోస్ కే మణి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేరళ అధికార వామపక్ష కూటమి లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఫ్)లో చేరారు. యూడీఎఫ్ నుంచి కేరళ కాంగ్రెస్ (ఎం) దాదాపు 38 ఏళ్ల తర్వాత విడిపోవడం గమనార్హం.
యూడీఎఫ్ మద్దతుతోనే మణి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యూడీఎఫ్ కూటమిలో జాతీయ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, పీజే జోసెఫ్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జాకబ్) పార్టీలు ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ (ఎం)లోని తన వైరి వర్గం పీజే జోసెఫ్ వర్గానికి యూడీఎఫ్ అండగా నిలబడటంతో జోస్ కే మణి జీర్ణించుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కేరళ కాంగ్రెస్ (ఎం) ఛైర్మన్ కేఎం మణి (జోస్ కె మణి తండ్రి) మృతితో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.
యూడీఎఫ్ శిబిరంలో తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని జోస్ కే మణి ఆరోపించారు. తాము తీసుకున్న నిర్ణయం తర్వాత కేరళ రాజకీయాలు చాలా మార్పులకు గురికాబోతున్నాయని వ్యాఖ్యానించారు. కేరళ కాంగ్రెస్ (ఎం) తరఫున గెలిచిన కొట్టాయం లోక్సభ సభ్యుడు థామస్ ఛాజికడమ్ మాత్రం రాజీనామా చేయబోరని వెల్లడించారు. కేరళ కాంగ్రెస్ (ఎం) నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను బలోపేతం చేస్తుందని తెలిపారు. సెంట్రల్ ట్రావెన్కోర్ ప్రాంతంలో కేరళ కాంగ్రెస్ (ఎం) బలమైన పార్టీ కావడంతో మైనారిటీ ఓట్లను ఆకర్షించవచ్చని అధికార ఎల్డీఎఫ్ భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట