బిహార్‌ 2020: ప్రముఖుల ఫలితాలు  ఇలా..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి.. అధికార ఎన్డీయే పోటా పోటీగా ఆధిక్యంలో...

Published : 10 Nov 2020 09:56 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి.. అధికార ఎన్డీయే పోటా పోటీగా ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ రాఘోపూర్‌లో ముందంజలో ఉన్నారు. హసన్‌పూర్‌లో ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, ఇమామ్‌గంజ్‌లో మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

భాజపా ప్రముఖ నేతలు నందకిశోర్‌ యాదవ్‌, ప్రేమ్‌ కుమార్‌, శ్రేయాసి సింగ్‌ ముందంజలో ఉన్నారు. శరద్‌ యాదవ్‌ కుమార్తె సుభాషిణి బిహారీగంజ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ నేత, సినీనటుడు శతృఘ్న సిన్హా కుమారుడు లవ్‌ సిన్హా బాంకిపూర్‌లో ముందంజలో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని