దిల్లీలో తెరాస కార్యాలయానికి స్థలం అప్పగింత

దేశరాజధానిలో తెరాస కార్యాలయం నిర్మాణకోసం కేటాయించిన స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు అప్పగించింది. కేంద్ర గృహ, ..

Published : 05 Nov 2020 01:00 IST

దిల్లీ: దేశరాజధానిలో తెరాస కార్యాలయం నిర్మాణకోసం కేటాయించిన స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు అప్పగించింది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని భూమి, అభివృద్ధి కార్యాలయం జేఈ సుమిత్‌కుమార్‌.. తెరాస నేత, తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి భూమి పత్రాలను అప్పగించి సరిహద్దులు నిర్ధారించారు. దిల్లీలోని వసంత్‌విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని తెరాస కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ ఈ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని