ఎవర్ని ఎంపిక చేసినా కలిసి పనిచేస్తాం:జగ్గారెడ్డి
టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడే ఉంటారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎవర్ని
హైదరాబాద్: టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడే ఉంటారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎవర్ని ఎంపిక చేసినా అంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంపై చర్చించేందుకు సోనియా, రాహుల్ గాంధీలను కలిసేందుకు ప్రయత్నిస్తు్న్నామని.. అనుమతి రాగానే దిల్లీ వెళ్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువైందన్నారు. ఓటు, డబ్బు అనే నినాదాన్ని తెరాస తెచ్చిందని.. సిద్ధాంతాలను నమ్మే పార్టీ అని చెప్పుకొనే భాజపా కూడా గ్రేటర్ ఎన్నికల్లో డబ్బు రాజకీయం చేసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థితి కాంగ్రెస్కు లేదన్నారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్లో ఆర్థిక పరిపుష్ఠి కలిగిన నేతలు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. పీసీసీ అధ్యక్ష ఎన్నిక తర్వాత ఆర్థికబలంతో కాంగ్రెస్ ఎన్నికలు వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం