రఘునందన్‌,‌ కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం

దుబ్బాక నియోజకవర్గం నుంచి భాజపా శాసనసభ్యుడిగా ఎన్నికైన రఘునందన్‌ రావు, గవర్నర్‌ కోటాలో శాసనమండలికి...

Updated : 18 Nov 2020 15:01 IST

హైదరాబాద్‌: దుబ్బాక నియోజకవర్గం నుంచి భాజపా శాసనసభ్యుడిగా ఎన్నికైన రఘునందన్‌ రావు, గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌ గుప్తా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్‌తో.. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు వీరంతా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు హాజరై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని