రఘునందన్, కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం
దుబ్బాక నియోజకవర్గం నుంచి భాజపా శాసనసభ్యుడిగా ఎన్నికైన రఘునందన్ రావు, గవర్నర్ కోటాలో శాసనమండలికి...
హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గం నుంచి భాజపా శాసనసభ్యుడిగా ఎన్నికైన రఘునందన్ రావు, గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్ గుప్తా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్తో.. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు వీరంతా గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా