‘శ్రీశైలం ఘటనపై సీబీఐ విచారణ కోరండి’
శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. క్షేత్రస్థాయి సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు...
గవర్నర్ తమిళిసైకు ఎంపీ రేవంత్ లేఖ
హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. క్షేత్రస్థాయి సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ఆయన లేఖ రాశారు. శ్రీశైలం ప్రమాదానికి మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్రావు బాధ్యత వహించాలని.. వారిద్దరిపై చర్యలకు సీఎం కేసీఆర్ను ఆదేశించవలసిందిగా గవర్నర్ను కోరారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని.. ఘటనపై సీబీఐ విచారణ కోరాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకున్నారని.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ ఆధునిక నియంతగా మారారని రేవంత్ విమర్శించారు. కొవిడ్ విషయంలో జోక్యం చేసుకున్నట్టుగానే శ్రీశైలం అగ్ని ప్రమాద ఘటన విషయంలోనూ జోక్యం చేసుకోవాలని గవర్నర్ను ఆయన కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు