జాతీయవిపత్తుగా ప్రకటించాలి: కోమటిరెడ్డి

తెలంగాణలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి...

Published : 15 Oct 2020 00:50 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. తక్షణ సహాయం కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.2వేల కోట్లు ఇవ్వాలని కోరారు. కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ నిండా మునిగిందని, జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు చేతి కొచ్చిన పంట నీట మునిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

 మోదీ స్పందించి.. తెలంగాణలో వర్ష బీభత్సంపై ఏరియల్‌ సర్వే నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాత నిలువునా మునిగిపోయాడని పేర్కొన్నారు. చేతికొచ్చిన వరి, పత్తి సహా అన్ని పంటలు నీటిలో మునిగి పోయాయని రైతులు ఆవేదన చెందుతున్నట్టు  తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయని, చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించిందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కచ్చితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.  సీఎం కేసీఆర్‌ వర్ష బీభత్సంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి లేఖలో ఆరోపించారు. రాజకీయాలపై దృష్టిపెట్టి భారీ వర్షాలను, వరద బీభత్సంలో ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని