మాఫియా శక్తులకు సీఎం స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మాఫియా శక్తులకు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోకపోతే 10 అడుగుల లోతులో పాతేస్తానని........

Published : 26 Dec 2020 02:15 IST

భోపాల్‌: మాఫియా శక్తులకు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోకపోతే 10 అడుగుల లోతులో పాతేస్తానని హెచ్చరించారు. శుక్రవారం అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా హోసంగాబాద్‌ జిల్లా బాబాయిలో సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో చౌహాన్‌ మాట్లాడారు. ‘‘మధ్యప్రదేశ్‌ను వదిలి వెళ్లండి. లేకపోతే 10అడుగుల లోతు భూమిలో పాతి పెట్టేస్తా. మీ ఆచూకీ కూడా తెలియదు’’ అంటూ మాఫియా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవాళ్లను సీఎం హెచ్చరించారు. సుపరిపాలన అంటే ప్రజలకు ఎలాంటి  ఇబ్బందుల్లేని పాలన అన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు.

ఇదీ చదవండి

బాక్సింగ్‌ డే టెస్టు.. ఆ పేరు ఎలా వచ్చింది?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని