‘కాంగ్రెస్ వల్లే తేజస్వీ సీఎం కాలేకపోతున్నారు’
తాజాగా జరిగిన బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనత కారణంగానే మహాకుటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ సీఎం కాలేకపోతున్నారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ తారిక్ అన్వర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ బిహార్లో కాంగ్రెస్ వల్లే మహాకుటమి
ఆ పార్టీ జనరల్ సెక్రటరీ తారిక్ అన్వర్
పట్నా : తాజాగా జరిగిన బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనత కారణంగానే మహాకుటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ సీఎం కాలేకపోతున్నారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ తారిక్ అన్వర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ బిహార్లో కాంగ్రెస్ వల్లే మహాకుటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుందనే వాస్తవాన్ని ఒప్పుకుంటున్నట్లు వివరించారు. ప్రజల్లో నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకోవడంలో ఆర్జేడీ, వామపక్షాల ప్రదర్శనతో పోలిస్తే కాంగ్రెస్ రాణించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ కూడా ఆ పార్టీల లాగా సీట్లు సాధించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యంపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బిహార్లోని తమ అగ్రశ్రేణి నాయకులు, అభ్యర్థులు, జిల్లా కమిటీలలో చర్చించి ఓటమికి గల కారణాలను పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తామని వివరించారు. ఇదిలా ఉంటే 2015 బిహార్ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 27 సీట్లు సాధించింది. ఈ సారి ఆర్జేడీ, వామపక్షాలతో కలిసి మహాకుటమిలో భాగమైన కాంగ్రెస్ ఏకంగా 70 సీట్లలో తమ అభ్యర్థులను ఉంచింది. కాగా 19 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్