రెండు పడక గదుల హామీ ఏమైంది?:రేవంత్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చడంలో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 06 Sep 2020 01:00 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చడంలో విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ పరిధిలో కనీసం 10 లక్షల మంది నివాసం లేనివారు ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటి వరకు 128 ఇళ్లు మాత్రమే కట్టిందని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో డివిజన్‌ యాత్ర చేపట్టానని, తెరాస విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తానని పేర్కొన్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ, ఖమ్మం,వరంగల్‌ ఎన్నికల్లో పురపాలక మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని