అమిత్ షా రాజీనామాకు దీదీ డిమాండ్!
పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరుగుతోన్న నాలుగోదశ పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని మమత డిమాండ్
కోల్కతా: పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరుగుతోన్న నాలుగోదశ పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కూచ్బెహార్లోని సీతల్కుచ్లో ఓటువేయడానికి క్యూలో నిల్చున్నవారిని భద్రతా బలగాలు కాల్పిచంపాయని ఆరోపిస్తూ.. తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భయాలే నిజమయ్యాయంటూ కేంద్రంపై మండిపడ్డారు.
‘భద్రతా బలగాలపై కేంద్ర హోంశాఖ ప్రభావం ఉందని మేం ముందునుంచి చెప్తున్నాం. ఇప్పుడు మా భయాలే నిజమయ్యాయి. ఆ బలగాల చేతిలో ఐదుగురు మరణించారు. ఎందుకు అన్ని మరణాలు సంభవించాయో హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. ఇంతమందిని చంపిన తరవాత కూడా..ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు వారు (ఎన్నికల సంఘం) చెప్పడం సిగ్గుచేటు. అదంతా అబద్ధం’ అని హింగల్ గంజ్ ఎన్నికల ప్రచారంలో మమత విరుచుకుపడ్డారు. ఓటమిని ముందుగానే గుర్తించిన భాజపా ఈ కుట్రలకు పాల్పడుతుందన్నారు.
‘అయినా సరే, ప్రజలంతా ప్రశాంతంగా ఉండి..శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోమని కోరుతున్నాను. వారిని ఓడించి, మరణాలకు ప్రతీకారం తీర్చుకోండి. ఇప్పటికి దాదాపు 18 మరణాలు చోటుచేసుకుంటే..అందులో 12 మంది తృణమూల్కు చెందినవారే. ఈ ఘటనపై ప్రజలకు ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి’ అని మమత డిమాండ్ చేశారు. ఇప్పుడు బాధ్యత అంతా ఎన్నికల సంఘానిదేనని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా..కూచ్బెహార్లోని ఘటనా స్థలానికి మమత రేపు వెళ్లనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM