మా ఇంటికి రండి.. సందేహాలు తీరుస్తా..
నూతన వ్యవసాయ చట్టాలపై సీఎం కేజ్రీవాల్కున్న సందేహాలు తీర్చడానికి తాను సిద్ధమని భాజపా ఎంపీ మనోజ్ తివారీ శనివారం ప్రకటించారు.
కేజ్రీవాల్ను ఇంటికి ఆహ్వానించిన భాజపా ఎంపీ
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై సీఎం కేజ్రీవాల్కున్న సందేహాలు తీర్చడానికి తాను సిద్ధమని భాజపా ఎంపీ మనోజ్ తివారీ శనివారం ప్రకటించారు. కేజ్రీవాల్ ఆదివారం తమ ఇంటికి వస్తే అన్ని సందేహాలు తీరుస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘‘ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మా ఇంటికి రండి. మీడియా ప్రతినిధుల ముందు మీకు వ్యవసాయ చట్టాలపై ఉన్న సందేహాలు తీరుస్తా.’’ అని మనోజ్తివారీ తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా నిర్మాణాత్మక రాజకీయాలు చేద్దామని ఆయన కేజ్రీవాల్ను కోరారు. కేజ్రీవాల్, ఆమ్ఆద్మీ పార్టీ రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో మనోజ్తివారీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను తన ఇంటికి ఆహ్వానించారు. ‘‘నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం అంటోంది. ఏ విధంగా వారికి ఈ కొత్త చట్టాలు ఉపకరిస్తాయో చెప్పండి. నిజమేంటంటే ఈ చట్టాలు రైతులకు ఏమాత్రం సహాయం చేయవు. వారికి హాని కలిగించేందుకే ఈ చట్టాలను తయారు చేశారు.’’ అని కేజ్రీవాల్ శుక్రవారం ట్విటర్లో పోస్టు చేశారు. ‘‘కేజ్రీవాల్కు ఇప్పటికీ మూడు నూతన చట్టాలపై సందేహాలుంటే నా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి రావాలి.’’ అని మనోజ్తివారీ తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు దిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!