అవసరమైతే చిరాగ్ సహకారం : తేజస్వి
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత అవసరమైతే తాము చిరాగ్ పాసవాన్ సహకారం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.
ఆ వార్తలను కొట్టిపారేసిన ఎల్జేపీ
పట్నా: ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత అవసరమైతే తాము చిరాగ్ పాసవాన్ సహకారం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రిన్స్ రాజ్ మంగళవారం ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవీ నివాసానికి వెళ్లిన నేపథ్యంలో తేజస్వి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘ఎన్నికల ఫలితాల తరవాత మెజార్టీ కొరవడితే, ఆర్జేడీ చిరాగ్ పాసవాన్ పార్టీ అయిన ఎల్జేపీ సహకారం తీసుకోవచ్చు’ అని తేజస్వి వ్యాఖ్యానించారు. ఈ ఊహాగానాలను ఎల్జేపీ తోసిపుచ్చింది. దివంగత నేత రాంవిలాస్ పాసవాన్కు నివాళులు అర్పించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మాత్రమే ఎల్జేపీ నేత అక్కడికి వెళ్లారని, దానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేసింది.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలిగి, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఇదివరకే చిరాగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, మూడు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM