గ్రేటర్‌ పోరు: మీడియా పాయింట్లు బంద్

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున  శాసనసభ, శాసన మండలి ప్రాంగణాల్లో

Published : 20 Nov 2020 17:36 IST

ఉత్తర్వులు జారీ చేసిన శాసనసభ కార్యదర్శి

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున  శాసనసభ, శాసన మండలి ప్రాంగణాల్లో మీడియా సమావేశాలను నిషేదిస్తూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటీసు జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసేవరకు ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించరాదని నోటీసుల్లో స్పష్టం చేశారు. నియమావళి అమల్లో ఉన్నంతకాలం మీడియా పాయింట్స్‌ను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని