టిడ్కో ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి: బొత్స
టిడ్కో ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
విజయనగరం: టిడ్కో ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.1500 ఖర్చును.. రూ.2 వేలు చొప్పున వెచ్చించి తెదేపా నేతలు దండుకున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’ పాదయాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పల నాయుడు, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, కార్యకర్తలతో కలిసి మెయిదా నుంచి నెల్లిమర్ల యూనియన్ మైదానం వరకు బొత్స పాదయాత్ర చేపట్టారు.
అనంతరం యూనియన్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ టిడ్కో గృహాల ప్రవేశాలకు ప్రతిపక్షాలు ఇచ్చిన పిలుపుపై స్పందించారు. తెదేపా హయాంలో ఆ పార్టీ నేతలు టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో కమీషన్ల పేరుతో రూ.వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బ్యాంకుల నుంచి సుమారు రూ.3,600 కోట్ల మేర అప్పులు తెచ్చి కమీషన్లు దండుకున్నారన్నారు. వారి హయాంలో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా ఇప్పుడు ఆందోళనలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 చదరపు అడుగుల ఇళ్లను పేద ప్రజలకు ఉచితంగా ఇస్తామని నాడు జగన్ ప్రకటించారని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్