తిరుపతి ఉపఎన్నికే రెఫరెండం: పెద్దిరెడ్డి
తిరుపతి ఉపఎన్నికను తెదేపా రెఫరెండంగా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో జరిగే ఉపఎన్నికలో
అమరావతి: తిరుపతి ఉపఎన్నికను తెదేపా రెఫరెండంగా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో జరిగే ఉపఎన్నికలో తెదేపా గెలిచే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలన్నారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇంతకంటే రెఫరెండం ఏముందని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నిక ఫలితం వచ్చాక తెదేపా ఏ స్థానంలో ఉంటుందో తేలుతుందన్నారు.
మరోవైపు అమరావతి రెఫరెండంపై అధికార ప్రతిపక్ష నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. జనభేరి ఉద్యమ వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. తెదేపా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి అమరావతి అంశంపై ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. దీనికి ప్రతిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తాను సిద్ధమంటూ ప్రతిసవాల్ విసిరారు. కృష్ణా జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!