మాది ఫుల్ లోడ్ బండి: తలసాని
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో వరదలు వచ్చిన నెలరోజుల తర్వాత బృందాన్ని పంపిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. కేంద్రబృందం...
104 స్థానాల్లో విజయం సాధిస్తామన్న మంత్రి
ఒత్తిడితెచ్చి వరదసాయం నిలిపివేశారని వ్యాఖ్య
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో వరదలు వచ్చిన నెలరోజుల తర్వాత బృందాన్ని పంపిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. కేంద్రబృందం వచ్చినా దమ్మిడీ కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. నగరంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల ఆర్థికసాయం ప్రకటించిందని చెప్పారు. ఆర్థిక సాయం కోసం ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించామని.. అర్హులందరికీ సాయం అందించాలనే ఆవిధంగా చేశామని చెప్పారు. ఇప్పటివరకు నేరుగా 4,75,781 మంది బాధితులకు సాయం అందజేశామన్నారు. మూడు రోజుల్లో 1.65లక్షల దరఖాస్తులు వచ్చాయని.. ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.165కోట్లు జమ చేశామని తలసాని వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వరద సాయం నిలిపివేయించారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సాయం అందజేయనున్నట్లు సీఎం చెప్పారని స్పష్టం చేశారు.
ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని తలసాని స్పష్టం చేశారు. ప్రజలకు కాంగ్రెస్, భాజపా ఏం చేశాయో చెప్పాలని ఆయన నిలదీశారు. ఆ రెండు పార్టీలకు 75 స్థానాలకూ అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కిషన్రెడ్డి కేంద్రమంత్రి అయిన తర్వాత ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయని.. సుమారు రూ.70వేల కోట్లతో హైదరాబాద్లో అభివృద్ధి పనులు చేపట్టామని తలసాని వివరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కరోజులో పూర్తికావని.. ఆలస్యమైనా వాటిని పూర్తిచేసి పేదలకు అందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కొందరికి తప్ప సిట్టింగులు అందరికీ అవకాశముంటుందని స్పష్టం చేశారు. తమది ఫుల్ లోడ్ బండి అని ఈ సందర్భంగా తలసాని వ్యాఖ్యానించారు. 150 డివిజన్లలోనూ పోటీచేసి.. 104 సీట్లలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే ఉంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన జనసేన ప్రచార సభలు వాయిదా పడ్డాయి. -
భీమిలి నియోజకవర్గంలో తెదేపాలోకి క్యూ కడుతున్న వైకాపా నేతలు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైకాపా నాయకులు తెదేపాలోకి క్యూ కడుతున్నారు. -
సత్తెనపల్లిలో బరితెగించిన వైకాపా నేతలు.. తెదేపా శ్రేణులపై దాడి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో వైకాపా నేతలు బరి తెగించారు. -
పార్టీ నిర్ణయం శిరోధార్యం: దేవినేని ఉమా
పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
రేపు నామినేషన్ వేయనున్న పవన్కల్యాణ్
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 23 (మంగళవారం)న నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. -
వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటే ఎలా?
ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని, దీన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. -
సొమ్ములిచ్చి.. జనాన్ని తెచ్చి!.. జగన్ బస్సు యాత్రకు నేతల ఆపసోపాలు
విశాఖలో ఆదివారం సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమంది. డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పంచి మరీ కొన్ని కూడళ్ల వద్ద జనాలను నింపాల్సి వచ్చింది. -
ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నారు?
‘విశాఖ స్టీల్ప్లాంట్కు చెందిన వేల ఎకరాలను అమ్మేయాలని చెప్పి, దాన్ని అంపశయ్య మీదకు చేర్చిన సీఎం జగన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని విశాఖకు వస్తున్నారు? నగరాన్ని గంజాయికి, డ్రగ్స్కు అడ్డాగా మార్చారు. -
శ్రీశైలం క్షేత్ర పరిధిలో.. ఎన్నికల ప్రచారంపై అధికారుల అభ్యంతరం
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. -
సొమ్ముతో ప్రచార సోకులు!
సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ఆదివారం సాయంత్రం విశాఖలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి వద్ద జనసమీకరణ చేశారు. -
బాబ్బాబు.. వైకాపా వీడొద్దయ్యా!
మేమంతా సిద్ధం అంటూ జగన్ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు. -
ఉద్యోగులను చూసి వణికిపోతున్న జగన్
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓట్లను తగ్గించేందుకు వైకాపా సర్కారు కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్బాబు ఆరోపించారు. -
ఆర్జేడీలో చేరిన బిహార్లోని ఎన్డీయే ఏకైక ముస్లిం ఎంపీ
బిహార్కు చెందిన ఎల్జేపీ లోక్సభ సభ్యుడు మహబూబ్ అలీ కైసర్ ఆదివారం ఆర్జేడీలో చేరారు. ఆ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు చెందిన ఏకైక ముస్లిం పార్లమెంటు సభ్యుడు మహబూబ్ అలీ కావడం గమనార్హం. -
హెచ్సీయూలో ఏబీవీపీ దాడులపై విచారణ జరపాలి: తమ్మినేని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఏబీవీపీ నాయకత్వంలో వారం రోజులుగా దాడులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్