‘‘అప్పటివరకు పండగలు జరుపుకోనివ్వరా?’’ 

వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. పండగకు నాలుగు రోజులే ఉందనగా ఇప్పుడు చెప్పడమేంటి? అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ తీవ్రత

Published : 18 Aug 2020 02:20 IST

రాజా సింగ్‌

హైదరాబాద్‌: వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. పండగకు నాలుగు రోజులే ఉందనగా ఇప్పుడు చెప్పడమేంటి? అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా గణేశ్‌, నవరాత్రి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలంటున్న ప్రభుత్వం మరి బక్రీద్‌కు ఎలా అనుమతి ఇచ్చారని రాజాసింగ్‌ నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతారన్నారు. 

కరోనా వైరస్‌ ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని.. అప్పటి వరకు హిందూ పండగలు జరుపుకోనివ్వరా అని ప్రశ్నించారు. కరోనాకు జాగ్రత్తలు తీసుకుంటూనే గణేశ్‌ ఉత్సవాలకు అనుమతించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ధూల్‌పేట గణేశ్‌ విగ్రహ తయారీదారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లక్ష మట్టి గణేష్‌ విగ్రహాలను పంచుతామని ప్రకటించిన ప్రభుత్వం.. ధూల్‌పేటలో తయారైన విగ్రహాలన్నీ కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని