దమ్ముంటే ఆ అంశాలపై మాట్లాడండి: తేజస్వి
బిహార్లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే తొలివిడత పోలింగ్ ముగియగా..రెండో విడత ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. నిరుద్యోగం, ఉపాధికల్పన, వలసవాదంపై మాట్లాడాలని...
పట్నా: బిహార్లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే తొలివిడత పోలింగ్ ముగియగా..రెండో విడత ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. నిరుద్యోగం, ఉపాధికల్పన, వలసవాదంపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ఈమేరకు ట్విటర్లో పోస్టు చేశారు. ‘‘తాను అధికారంలో ఉన్న గత 15 ఏళ్లలో రాష్ట్రంలో విద్య, వైద్యం పరిశ్రమలు పూర్తిగా నాశనమయ్యాయని, ప్రజల భవిష్యత్తును గంగలో కలిపేశానని’’ ముఖ్యమంత్రి నీతీశ్ ఒప్పుకున్నారని అన్నారు. అందుకే ఆయన ఆయా అంశాలపై మాట్లాడటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, అవినీతి తదితర అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘కుమారుడి కోసం తపన వల్లే వారికి తొమ్మది మంది సంతానం’ అని నితీశ్ వ్యక్తిగత విమర్శలు చేశారని గుర్తు చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి ఆరుగురు తోబుట్టువులున్న సంగతి మర్చిపోయారా? అని తేజస్వి ప్రశ్నించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా ఎదుటి వారిని కించపరిచేలా మాట్లాడటం సరి కాదన్నారు. సీఎం నితీశ్కుమార్ ఎన్ని విమర్శలు చేసినా అవి ఆర్జేడీకి ఆశీస్సులుగా పని చేస్తాయని పునరుద్ఘాటించారు. మరోవైపు యువతకి ఉపాధి కల్పనే తమ ధ్యేయమని తేజస్వి అన్నారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపిస్తామని చెప్పారు. సమస్యలను పరిష్కరించే వారికే బిహార్ ప్రజలు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 243 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. 28న తొలి విడత పోలింగ్ ముగిసింది. 55.69 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండో విడత పోలింగ్ నవంబర్ 3న జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి