అవన్నీ బోగస్ మాటలే: నితీశ్
బిహార్ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య కీలక ప్రచారాస్త్రంగా మారింది. అధికార, విపక్ష కూటముల మధ్య ఇదే అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై తాము అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే ...........
పట్నా: బిహార్ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య కీలక ప్రచారాస్త్రంగా మారింది. అధికార, విపక్ష కూటముల మధ్య ఇదే అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే 10లక్షల ఉద్యోగాల కల్పనపై నిర్ణయం తీసుకుంటామన్న మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హామీపై జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10లక్షల ఉద్యోగాల హామీ వట్టి బోగసేనని విమర్శించారు. ఇలాంటి మాటలతో ప్రజల్ని తప్పుదారి పట్టించి అయోమయంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శుక్రవారం పర్బట్టాలోని ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన నితీశ్.. గత ఆర్జేడీ పాలనను ఎండగట్టారు. లాలూ హయాంలో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల మహిళలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. గతంలో మహిళల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదన్నారు. వారి సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. జేడీయూ అధికారంలోకి వచ్చాక మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. మహిళలను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ఓటు ముందు.. తర్వాతే వంట!
గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ‘జీవిక’ వంటి ప్రాజెక్టులు తీసుకొచ్చామని నితీశ్ తెలిపారు. బిహార్ అభ్యున్నతిలో మహిళల భాగస్వామ్యం ఎంతో ఉందని, నవంబర్ 3న జరిగే రెండో దశ ఎన్నికల్లో మహిళలు ఓటు ముందు వేసి ఆ తర్వాత వంట చేసుకోవాలని సూచించారు. గతంలో నగరాలకు కూడా విద్యుత్ ఉండేది కాదన్న ఆయన.. లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) పాలన అంతమయ్యాక ప్రజల ఇంటికి విద్యుత్ వెలుగులు తీసుకొచ్చామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్కు మరిన్ని ప్రాజెక్టులు ఇచ్చారని, ప్రజలు ఎన్డీయే కూటమికి మరో అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?