‘నీతీశ్ది ఎమోషనల్ బ్లాక్మెయిల్’
ఇవే తన చివరి ఎన్నికలంటూ బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ నిన్న చేసిన వ్యాఖ్యలపై జన్ అధికార్ పార్టీ నేత పప్పూ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. నీతీశ్ ఓటర్లను ఎమోషనల్ ........
అదంతా భాజపా స్క్రిప్టే: పప్పూ యాదవ్
పట్నా: ఇవే తన చివరి ఎన్నికలంటూ బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ నిన్న చేసిన వ్యాఖ్యలపై జన్ అధికార్ పార్టీ నేత పప్పూ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. నీతీశ్ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇంత పిరికి, బలహీనమైన, నిస్సహాయమైన వ్యక్తి మళ్లీ ఎందుకు సీఎం కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నీతీశ్ బిహార్ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకొని కేంద్ర రాజకీయాల్లో చేరాలన్నారు. ఇదంతా భాజపా స్క్రిప్టేనని పప్పూ యాదవ్ ఆరోపించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో మలి దశ ఎన్నికలకు నిన్నటితో ప్రచార పర్వం ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న పూర్ణియా జిల్లా ధమ్దాహాలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న నీతీశ్ ‘‘ప్రచారంలో ఇదే చివరి రోజు.. ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది. ఇవే నా చివరి ఎన్నికలు’’ అంటూ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం 19 జిల్లాల పరిధిలో 78 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా