పార్టీలకు సెల్లు కాదు..టాలెంటే ముఖ్యం
రాజకీయ పార్టీలు కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా విభాగాలు (సెల్) ఏర్పాటుకు తాను అనుకూలం కాదని కేంద్రమంత్రి , భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ అన్నారు. వీటికన్నా టాలెంటే ముఖ్యమని తెలిపారు. .......
కేంద్రమంత్రి , భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ
నాగ్పూర్: రాజకీయ పార్టీలు కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా విభాగాలు(సెల్) ఏర్పాటుకు తాను అనుకూలం కాదని కేంద్రమంత్రి , భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ అన్నారు. వీటికన్నా ప్రతిభ ముఖ్యమని తెలిపారు. తూర్పు విదర్భలోని భాజపా పట్టభద్రుల అభ్యర్థి సందీప్ జోషీకి మద్దతుగా ఆయన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. మనిషి కులం వల్ల గొప్పవాడు కాలేడని, ప్రతిభ వల్లే అవుతాడనేది తన అభిప్రాయమన్నారు. భాజపాలోనూ వేర్వేరు సెల్లు ఉన్నాయని.. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ అనుభవం ఎదురైందన్నారు.
కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా ఎలాంటి విభాగాలు ఏర్పరచకూడదనేది తన అభిప్రాయమని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పార్టీ, కార్యకర్తలే తమ కుటుంబమన్నారు. ఎప్పుడూ కులాలు, వర్గాల ప్రాతిపదికన రాజకీయం చేయలేదని చెప్పారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉంటాం.. వాళ్లను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాం.. ఇదే భాజపా ప్రత్యేకత అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్