ఇప్పుడు భాజపా టర్న్.. రిసార్టులకు ఎమ్మెల్యేలు!
సెంబ్లీ సమావేశాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ రాజస్థాన్లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. నిన్నటి వరకు తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలో ఓ చోట... సీఎం అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు మరో చోట రిసార్టుల్లో తలదాచుకున్నారు. ఇప్పుడు భాజపా......
జైపుర్: అసెంబ్లీ సమావేశాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ రాజస్థాన్లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. నిన్నటి వరకు తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు ఓ చోట... సీఎం అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు మరో చోట రిసార్టుల్లో తలదాచుకున్నారు. ఇప్పుడు భాజపా వంతు వచ్చింది. అశోక్ గహ్లోత్ ఒత్తిళ్ల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని గుజరాత్ తరలిస్తోంది.
ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం జైపుర్ విమానాశ్రయం నుంచి ఛార్టెడ్ విమానంలో గుజరాత్లోని పోర్బందర్కు తరలివెళ్లారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు తరలి వెళ్లినట్లు సమాచారం. సుమారు 40 మంది ఎమ్మెల్యేలను ఈ విధంగా ఆ పార్టీ తరలించనున్నట్లు తెలుస్తోంది.
తమను రాష్ట్ర పోలీసులు వేధిస్తున్నారని, అందుకు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు శనివారం తరలివెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన అశోక్ లహోతి పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యేల తరలింపు వార్తలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పునియా తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే కావాలని లేనిపోని ప్రచారాలను వెలుగులోకి తెచ్చి గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు. అయితే, భాజపా ఎమ్మెల్యేలు పోర్బందర్ వెళ్లడాన్ని ఎయిర్పోర్ట్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు