బండి సంజయ్‌కి మోదీ ఫోన్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు

Updated : 24 Sep 2022 14:36 IST

గ్రేటర్‌ ఎన్నికలపై ప్రధాని ఆరా

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల సరళి, తాజా పరిస్థితులపై ముచ్చటించినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యాలపై ప్రధానికి వివరించినట్లు బండి సంజయ్‌ వివరించారు. ఎన్నికల్లో భాజపాకు విజయాన్ని అందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని.. కొత్త ఉత్సాహంతో పార్టీ కేడర్‌ నడుచుకోవడంపై మోదీ హర్షం వ్యక్తి చేసినట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని సూచించినట్లు బండి సంజయ్‌ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని