Telangana Politics: నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి

నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా తెరాస పాడి కౌశిక్‌రెడ్డి పేరును మంత్రివర్గం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన..

Updated : 01 Aug 2021 22:54 IST

హైదరాబాద్‌: నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డి పేరును మంత్రివర్గం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రి వర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కౌశిక్‌రెడ్డి పేరును మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ‘తెరాస టికెట్‌ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ’ బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు. పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని