కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌!

పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు భారత్‌లోని ప్రముఖుల వ్యక్తిగత వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. తాజాగా  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారు......

Published : 26 Aug 2020 01:34 IST

దిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు భారత్‌లోని ప్రముఖుల వ్యక్తిగత వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. తాజాగా  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్‌ రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురైంది. ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు పెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు సందేశాలు పెట్టారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కిషన్‌ రెడ్డి కార్యాలయం మంగళవారం ధ్రువీకరించింది. హ్యాకింగ్‌ అనంతరం ఆయన వెబ్‌సైట్‌ (kishanreddy.com)ఓపెన్‌ చేస్తే ‘ తాత్కాలికంగా అందుబాటులో లేదు’ అనే సందేశం వస్తోంది. 

కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. ఆయన వ్యక్తిగత వివరాలతో పాటు రోజువారీగా ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని స్పష్టంచేశారు. ఈ వెబ్‌సైట్‌లో కిషన్‌ రెడ్డి వ్యక్తిగతమైన వివరాలతో పాటు ఆయన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయని.. ఇవన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నవేనని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని