ఆర్జేడీ కూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ ఔట్!
బిహార్ ఎన్నికలు రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి. ఓ వైపు పోలింగ్ తేదీలు దగ్గర పడుతుండగా.. ఇప్పటి వరకు కూటముల్లో సీట్ల పంపిణీ ఖారారు కాలేదు. తమకు సరైన న్యాయం జరగడం లేదనే ఉద్దేశం పలు పార్టీలు కూటముల నుంచి బయటకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి...
పట్నా: బిహార్ ఎన్నికలు రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి. ఓ వైపు పోలింగ్ తేదీలు దగ్గర పడుతుండగా.. ఇప్పటి వరకు కూటముల్లో సీట్ల పంపిణీ ఖారారు కాలేదు. తమకు సరైన న్యాయం జరగడం లేదనే ఉద్దేశంతో పలు పార్టీలు కూటముల నుంచి బయటకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) విపక్ష ఆర్జేడీ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మళ్లీ మూడో ఫ్రంట్ ఏర్పాటు తథ్యమనిపిస్తోంది.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే 2019 జనరల్ ఎన్నికలకు ముందు భాజపాతో విభేదించి కూటమి నుంచి వైదొలిగి, ప్రతిపక్ష ఆర్జేడీ కూటమిలో చేరింది. అయితే తాజాగా సీట్ల పంపిణీ అంశంలో ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వియాదవ్తో విభేదాలు తలెత్తడంతో కూటమి నుంచి బయటకొచ్చి బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార భాజపా నుంచి కూడా తమకు ఆహ్వానం ఉందని ఆర్ఎల్ఎస్పీ నేతలు చెబుతుండటం గమనార్హం. అంతేకాకుండా బీజేపీ-జేడీయూ కూటమితో రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తెగతెంపులు చేసుకుంటుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహాగట్ బంధన్ నుంచి ఆర్ఎల్ఎస్పీ వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. బిహార్లో మూడు విడతలుగా అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..