ఒక్కరికోసం తిరుమల సంప్రదాయాలు మార్చడమా?
ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్సభలో లేవనెత్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్ వేయాలని .....
లోక్సభలో ప్రశ్నించిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్సభలో లేవనెత్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్ వేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఎంతో విశిష్ఠ చరిత్ర ఉన్న తిరుమల ఆలయ నియమ నిబంధనలను ఒక్క వ్యక్తి కోసం మారుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మిగతా వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు.
అన్యమతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు డిక్లరేషన్ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అంతకముందు దిల్లీలో రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్ కూడా డిక్లరేషన్పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. ఆలయనిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.