ప్రజాస్వామ్యం కోసం గళమెత్తండి: రాహుల్
రాజస్థాన్లో రాజకీయ అనిశ్చితికి భాజపానే కారణమని కాంగ్రెస్ పార్టీ అరోపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీని కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోందని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గలమెత్తాలని ఆ పార్టీ.....
దిల్లీ: రాజస్థాన్లో రాజకీయ అనిశ్చితికి భాజపానే కారణమని కాంగ్రెస్ పార్టీ అరోపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీని కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోందని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గళమెత్తాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో ట్విటర్లో పోస్ట్ చేశారు.
దేశమంతా కరోనాపై పోరాడుతుంటే.. భాజపా ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో అదే చేశారు.. ఇప్పుడు రాజస్థాన్లో అదే చేస్తున్నారని విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీని తక్షణమే సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు #SpeakUpForDemocracy పేరిట హ్యాష్ట్యాగ్ ఏర్పాటు చేసి.. ఈ పోరులో భాగస్వాములు అవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రపతి భవన్ ఎదుట ఆందోళన చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రాజస్థాన్ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలకూ సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్