పేదవారి బాధేంటో తెలుస్తోందా: రాహుల్
దేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు....
దిల్లీ: దేశంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అలానే పట్టణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం తమ పార్టీ సూచించిన కనీస ఆదాయ హామీ పథకం (ఎన్వైఏవై) కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటి అమలుతో ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని అధిమించడంతో పాటు, పెరుగుతున్న పని భారాన్ని తగ్గించేందుకు ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ మరోమారు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ఉపాధి హామీ పథకానికి ఉన్న డిమాండ్కు సంబంధించిన గ్రాఫ్ను షేర్ చేశారు. ‘‘ పట్టణాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం అమలు ఎంతైనా అవసరం. అలానే దేశవ్యాప్తంగా ఉన్న పేదవారి కోసం ఎన్వైఏవై కూడా అమలు చేయాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ పేదవారి బాధలను ఈ సూటు బూటు ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా’’ అని ట్వీట్ చేశారు. దేశంలో కరోనా మొదలైన నాటి నుంచి పేదవారిని ఆదుకునేందుకు జన్ధన్ ఖాతాలతోపాటు, అన్ని రకాల పెన్షన్దారులు, పీఎం కిసాన్ ఖాతాల్లో రూ. 7,500 జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్