‘PR మీడియా వ్యూహాలతో చైనాను ఎదుర్కోలేం’
ఓవైపు కాంగ్రెస్ అధినాయకత్వంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వెళ్లగక్కుతుండగా.. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా వివాదాస్పద డోక్లామ్ పీఠభూమి
కేంద్రంపై రాహుల్గాంధీ విమర్శలు
దిల్లీ: ఓవైపు కాంగ్రెస్ అధినాయకత్వంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వెళ్లగక్కుతుండగా.. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా వివాదాస్పద డోక్లామ్ పీఠభూమి సమీపంలో పొరుగు దేశం చైనా కీలక నిర్మాణాలు చేపట్టినట్లు వార్తలు రావడంతో మరోసారి ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. పీఆర్(పబ్లిక్ రిలేషన్ అధికారి)లతో నడిచే మీడియా వ్యూహాలతో మోదీ ప్రభుత్వం చైనాను ఎదుర్కోలేదని దుయ్యబట్టారు.
డోక్లాంలో చైనా నిర్మాణాలపై ఓ జాతీయ మీడియా కథనాన్ని ట్విటర్లో షేర్ చేసిన రాహుల్.. ‘చైనా భౌగోళిక రాజకీయ వ్యూహాలను పీఆర్లతో నడిచే మీడియా వ్యూహాలతో ఎదుర్కోలేం. ఇంత చిన్న విషయం భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారికి అర్థమైనట్లు లేదు’ అని ఎద్దేవా చేశారు. చైనా విషయంలో రాహుల్ గతంలో కూడా పలు మార్లు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చైనాకు మోదీ లొంగిపోయారంటూ రాహుల్ ఆ మధ్య ఘాటు వ్యాఖ్యలు చేయగా.. భాజపా వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
డోక్లామ్ పీఠభూమికి చేరువలో భూటాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి గ్రామాన్ని నిర్మించిన చైనా.. ఆ ప్రాంతంలో రోడ్డు కూడా వేస్తోందని తాజాగా వెల్లడైంది. ఈ మేరకు హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా బట్టబయలైంది. అంతేగాక, రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అధునాత రాడార్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. లద్ధాఖ్ విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ చైనా తాజా నిర్మాణాలు కొత్త వివాదానికి తెరతీస్తున్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్