రాజస్థాన్ పాలిటిక్స్: కొనసాగుతున్న ఉత్కంఠ!
రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్కు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలోనే సచిన్ వేసిన పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టులో నేడు మరోసారి విచారణ కొనసాగుతోంది. ఈరోజు విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
సచిన్ పైలట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
ముఖ్యమంత్రి అధ్యక్షతన మరోసారి సమావేశమైన సీఎల్పీ
జైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్కు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలోనే సచిన్ వేసిన పిటిషన్పై రాజస్థాన్ హైకోర్టులో నేడు మరోసారి విచారణ కొనసాగుతోంది. ఈరోజు విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఇదే సమయంలో, ఇరువర్గాల క్యాంపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మద్దతుదారులు దాదాపు 100మంది ఎమ్మెల్యేలు గడిచిన వారం రోజులుగా జైపూర్లోని ఫెయిర్మోంట్ హోటల్లోనే మకాం వేసివున్నారు. తాజాగా అక్కడే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం(సీఎల్పీ) జరుగుతోంది. ఈవారం రోజుల్లో సీఎల్పీ సమావేశం కావడం ఇది మూడోసారి. అయితే ఈ సమావేశానికి రెబల్ నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు నిన్నటివరకూ ఉంచనా వేశారు. కానీ, తాజాగా రెబల్ నేత సచిన్ పైలట్ ఒక దద్దమ్మ అంటూ ముఖ్యమంత్రి గహ్లోత్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సచిన్ మరింత దూరమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సచిన్ వర్గం కూడా హైకోర్టు తీర్పుపైనే ఆశలు పెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..