సుప్రీం కోర్టుకు రాజస్థాన్ పంచాయితీ!
రాజస్థాన్ రాజకీయం మరో మలుపు తీసుకుంది. పైలట్ వర్గంపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదంటూ రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సుప్రీం కోర్టుకు......
జైపుర్: రాజస్థాన్ రాజకీయం మరో మలుపు తిరిగింది. పైలట్ వర్గంపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదంటూ రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సుప్రీం కోర్టుకు వెళుతున్నట్లు స్పీకర్ సీపీ జోషి వెల్లడించారు. ‘రాజ్యాంగ సంక్షోభం’ తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
స్పీకర్ ఇచ్చిన నోటీసులపై సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని తొలుత ఆదేశించింది. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం వరకూ ఎలాంటి చర్యలూ వద్దని మరోసారి సూచించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ జోషి బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్దే తుది నిర్ణయమని సుప్రీం కోర్టు ఇది వరకే వెల్లడించింది. దీనిపై ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అధికారం స్పీకర్కు ఉంది. అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది’’ అని స్పీకర్ పేర్కొన్నారు.
మరోవైపు కాలయాపన జరిగే కొద్దీ సచిన్ వర్గం బలం పెరిగే అవకాశం ఉందని సీఎం అశోక్ గహ్లోత్ వర్గం భావిస్తోంది. అందుకే వీలైనంత తొందరగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండడం, కాలయాపన జరుగుతుండడం అశోక్ గహ్లోత్ వర్గాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరుతుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ