అక్కడ నుంచి వస్తేనే మాట్లాడుతాం..
రాజస్థాన్లో అసమ్మతి గళమెత్తిన సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు పార్టీతో చర్చలు జరిపేందుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. అయితే, హరియాణాలో ఉంటున్న వారు భాజపా ఆశ్రయాన్ని వదిలి వస్తేనే....
దిల్లీ: రాజస్థాన్లో అసమ్మతి గళమెత్తిన సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు పార్టీతో చర్చలు జరిపేందుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా అన్నారు. అయితే, హరియాణాలో ఉంటున్న వారు భాజపా ఆశ్రయాన్ని వదిలి వస్తేనే చర్చలని స్పష్టంచేశారు. వారికి ఖట్టర్ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు.
‘‘గురుగ్రామ్లో అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. అక్కడ పోలీసులు అందుబాటులో లేరు. కానీ, 19 మంది ఎమ్మెల్యేలకు రక్షణగా వెయ్యి మందికి పైగా పోలీసులు కాపలాగా ఉన్నారు. పార్టీతో చర్చలు జరపాలంటే వారు ముందు భాజపాతో దోస్తీని, ఆశ్రయాన్ని, పోలీసుల రక్షణను వదిలి రావాలి. అప్పుడే చర్చలు జరుగుతాయి’’ అని సూర్జేవాలా స్పష్టంచేశారు. సుశాంత్సింగ్ రాజ్పూత్ కేసులో బిహార్ పోలీసుల జోక్యాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ కేసు మహారాష్ట్ర పోలీసుల పరిధిలో అంశమని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్