అమరావతిపై ఆన్లైన్లో ప్రజాభిప్రాయ సేకరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరదామని తాము విసిరిన సవాల్ను వైకాపా ప్రభుత్వం స్వీకరించకపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరారు. www.apwithamaravati.com పేరుతో వెబ్సైట్ను...
ప్రత్యేక వెబ్సైట్ రూపొందించిన తెదేపా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరదామని తాము విసిరిన సవాల్ను వైకాపా ప్రభుత్వం స్వీకరించకపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరారు. www.apwithamaravati.com పేరుతో వెబ్సైట్ను రూపొందించారు. ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధితోపాటు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా? అనే ప్రశ్నను అందులో ఉంచారు. వెబ్సైట్ ద్వారా ఓటు వేసి అమరావతిని రక్షించుకోండి అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ వెబ్సైట్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 36 గంటల వ్యవధిలోనే 3లక్షల మందికి పైగా ప్రజలు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వీరిలో 90 శాతం మందికి పైగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే ఉండాలని స్పష్టం చేశారు.
అమరావతి పేరు ఘన చరిత్రతో ముడిపడి ఉంది..
అమరాతి చరిత్ర, రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను చంద్రబాబు ఆ వెబ్సైట్లో స్పష్టంగా వివరించారు. అమరావతి ఆంధ్రరాష్ట్రానికి కేంద్ర బిందువని వెల్లడించారు. రాష్ట్రానికే కాకుండా దేశానికే అభివృద్ధి కేంద్రంగా చేయాలనే భవిష్యత్తు లక్ష్యంతో.. మూడు మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలతో మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతుందనే ఆశాభావంతో రూపొందించామన్నారు. వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ పథకంతో 26,839 మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. అమరావతి అనే పేరు ఘన చరిత్రతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమరావతికి సంబంధించిన ఫొటోలు, పత్రాలను వెబ్సైట్లో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం