‘‘ప్రజల దృష్టి మరల్చేందుకే కుల రాజకీయాలు’’
ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ మోహన్ రెడ్డి పదేపదే కుల ప్రస్తావన తేవడం బాధాకరమని గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు...
రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శ
రేపల్లె: ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ మోహన్ రెడ్డి పదేపదే కుల ప్రస్తావన తేవడం బాధాకరమని గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. జగన్కు ఆ సామాజిక వర్గంపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ఇటీవల విజయవాడలో జరిగిన స్వర్ణా ప్యాలెస్ హోటల్ ప్రమాద ఘటనలో డాక్టర్ రమేశ్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాయపాటి మమతను విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సామాజిక వర్గం వారు డాక్టర్లు, పోలీసులు, వ్యాపారవేత్తలు, రైతులుగా ఉండకూడదా? అని ప్రశ్నించారు. అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితులు అధికంగా ఉన్న అమరావతిని చంపేస్తున్నారన్న ఆయన.. రాజధానికి భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారని విమర్శించారు. నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులుండవు కానీ, చట్ట ప్రకారం నడుచుకునే వారిని కుల ధ్వేషంతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్