సీఎం గారూ.. పంటనష్టం తీవ్రత అర్థంకావట్లేదా? 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరదల వల్ల జరిగిన పంటల నష్టం తీవ్రత అర్థం కావడం లేదా? అని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి.......

Published : 20 Aug 2020 01:12 IST

కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరదల వల్ల జరిగిన పంటల నష్టం తీవ్రత అర్థం కావడం లేదా? అని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు సీఎంకు బుధవారం ఆయన ఓ లేఖ రాశారు. బీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు తీవ్ర నష్టం చేశారని విమర్శించారు. నష్టపోయిన రైతులకు రూ.20వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. పరిహారం చెల్లింపు కోసం కోసం తక్షణమే రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలన్నారు. రైతులు మళ్లీ పంట వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని