
Published : 27 Nov 2020 01:17 IST
అంత గౌరవమే ఉంటే భారతరత్న ఇవ్వండి
ఎంపీ రేవంత్రెడ్డి
హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు భాజపా, ఎంఐఎం పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పరాయి నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని అడ్వాణీ, జోషీ తదితర నాయకులకు ఆ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేకపోయిందని రేవంత్ విమర్శించారు. పీవీ, ఎన్టీఆర్లపై భాజపాకు ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. 29న నగరానికి వస్తున్న భాజపా అగ్రనాయకులు మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ఈ ప్రకటన చేయాలని అన్నారు.
Tags :