అంత గౌరవమే ఉంటే భారతరత్న ఇవ్వండి

మాజీ ప్రధాని పీవీ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు..

Published : 27 Nov 2020 01:17 IST

ఎంపీ రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు భాజపా, ఎంఐఎం పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పరాయి నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని అడ్వాణీ, జోషీ తదితర నాయకులకు ఆ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేకపోయిందని రేవంత్‌ విమర్శించారు. పీవీ, ఎన్టీఆర్‌లపై భాజపాకు ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 29న నగరానికి వస్తున్న భాజపా అగ్రనాయకులు మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ఈ ప్రకటన చేయాలని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని