కేటీఆర్‌ తక్షణమే నగరంలో పర్యటించాలి:రేవంత్‌

నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. వర్షాలకు నగరంలోని నాలాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోందని..

Published : 21 Sep 2020 17:16 IST

హైదరాబాద్‌: నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. వర్షాలకు నగరంలోని నాలాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం మీడియాతో రేవంత్‌ మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో కాలనీలు మునిగిపోతున్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలకి అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తక్షణమే నగరంలో పర్యటించి నాలాల స్థితిగతులు, మ్యాన్‌ హోళ్లను పరిశీలించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలకు ప్రమాద ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నగరంలోని డివిజన్‌ల కాంగ్రెస్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారికి అవసరమైన సహాయ సహకారాలందించాలని రేవంత్‌ రెడ్డి సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని