కాంగ్రెస్‌లోనే సచిన్‌ పైలట్‌!

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి దాదాపు తెరపడింది. సచిన్‌పైలట్‌ వర్గంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్చలు ముగిశాయి. అసంతృప్తితో సొంత పార్టీ నాయకులపైనే తిరుగు బావుటా ఎగురవేసిన సచిన్‌పైలట్‌ ఇకపై కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఆ పార్టీ సీనియర్‌ నేతలు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని సమస్యలను పార్టీ నేతలకు వివరించినట్లు సచిన్‌పైలట్‌ పేర్కొన్నారు.

Published : 10 Aug 2020 23:14 IST

 

జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి దాదాపు తెరపడింది. సచిన్‌పైలట్‌ వర్గంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్చలు ముగిశాయి. అసంతృప్తితో సొంత పార్టీ నాయకులపైనే తిరుగు బావుటా ఎగురవేసిన సచిన్‌పైలట్‌ ఇకపై కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఆ పార్టీ సీనియర్‌ నేతలు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని సమస్యలను పార్టీ నేతలకు వివరించినట్లు సచిన్‌పైలట్‌ పేర్కొన్నారు. అన్ని విషయాలను చర్చించామని, వాటిని పరిష్కరిస్తామని అధిష్ఠానం భరోసా ఇచ్చిందని ఆయన వెల్లడించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత కె.సి. వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్‌ పైలట్‌ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ సర్కార్‌ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని