కంగనకేనా భద్రత.. బాధితులకు లేదా?
హాథ్రస్ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి భద్రత కల్పించకపోవడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ముంబయికి చెందిన ఓ కథానాయికకు ‘వై-ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం.. బెదిరింపులు ఎదుర్కొంటున్న బాధిత దళిత కుటుంబానికి ఎందుకు రక్షణ ఇవ్వట్లేదని ప్రశ్నించింది
హాథ్రస్ ఘటనలో కేంద్రంపై శివసేన విమర్శలు
ముంబయి: హాథ్రస్ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి భద్రత కల్పించకపోవడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ముంబయికి చెందిన ఓ కథానాయికకు ‘వై-ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం.. బెదిరింపులు ఎదుర్కొంటున్న బాధిత దళిత కుటుంబానికి ఎందుకు రక్షణ ఇవ్వట్లేదని ప్రశ్నించింది. ఈ మేరకు తమ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
‘హాథ్రస్ ఘటనలో బాధిత కుటుంబం బెదిరింపులు ఎదుర్కొంటూ భయంభయంగా బతుకుతోంది. అలాంటప్పుడు వారికి వై ప్లస్ భద్రత కల్పించమని డిమాండ్ చేయడంలో తప్పేముంది. మొన్నటికి మొన్న ముంబయిలో ఓ నటి(కంగనా రనౌత్)కి కేంద్రం వై ప్లస్ భద్రత ఇచ్చింది. కానీ హాథ్రస్ బాధిత కుటుంబానికి మాత్రం రక్షణ ఇవ్వట్లేదు. ఇది సమాన న్యాయం అనిపించుకోదు. డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో ఇలాంటి న్యాయం ఎక్కడా లేదు’ అని శివసేన దుయ్యబట్టింది.
అంతేగాక, హాథ్రస్ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడంపై కూడా శివసేన అనుమానాలు వ్యక్తం చేసింది. బాధిత కుటుంబం జ్యుడీషియల్ విచారణ కోరుతుంటే.. సీబీఐ దర్యాప్తు ఎందుకు అని ప్రశ్నించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతురాలి అంత్యక్రియలను హుటాహుటిన జరిపించారని ఆరోపించింది.
గత నెల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీస్ కూల్చివేత వ్యవహారంలో కేంద్రం ఆమెకు వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. ముంబయి పోలీసుల నుంచి తనకు ప్రమాదం ఉందని కంగన వ్యాఖ్యలు చేయడంతో కేంద్రం ఆమెకు రక్షణ కల్పించింది. ఇదే వ్యవహారంపై సామ్నా ఇప్పుడు కేంద్రానికి చురకలంటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం