ఒక్క అవకాశమివ్వాలని..
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది.
రఘునందన్కు తొలి విజయం సాధ్యమైందిలా!
ఇంటర్నెట్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో భాజపా తొలి రౌండ్ నుంచే ఆధిక్యం ప్రదర్శించింది. కొన్ని రౌండ్లలో భాజపాను తెరాస అధిగమించినప్పటికీ చివర్లో మళ్లీ కాషాయ పార్టీ పుంజుకుని 1,470 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని ముద్దాడింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. భాజపా విజయానికి రఘునందన్రావు వ్యక్తిగత ఛరిష్మా, సానుభూతి కలిసి వచ్చాయి. ఒక్కసారి అవకాశమివ్వాలంటూ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన విజ్ఞప్తితో వచ్చిన సానుభూతి.. గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటాననే ప్రచారం రఘునందన్ను విజయతీరాలకు చేర్చాయి.
న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి..
రఘునందన్రావు 1968 మార్చి 23న సిద్దిపేటలో జన్మించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. అనంతరం సిద్దిపేట నుంచి పటాన్చెరుకు తన నివాసాన్ని మార్చుకుని కొన్నాళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తితో 2001లో రఘునందన్రావు తెరాసలో చేరి తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో కేసీఆర్కు సన్నిహితుడిగా కొనసాగారు. దశాబ్దానికి పైగా తెరాసలో కొనసాగిన ఆయన్ను 2013లో ఆ పార్టీ సస్పెండ్ చేసింది. తెదేపాతో సన్నిహితంగా మెలుగుతున్నారనే ఆరోపణలపై రఘునందన్ను తెరాస బయటకు పంపింది. అనంతరంలో ఆయన భాజపాలో చేరి 2014 ఎన్నికల్లో దుబ్బాక అభ్యర్థిగా బరిలో నిలిచారు.
రఘునందన్ వ్యక్తిగత ఛరిష్మా.. నాయకత్వం దూకుడు
దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా విజయం సాధించడంలో పార్టీ నేపథ్యం కంటే రఘునందన్ వ్యక్తిగత ఛరిష్మానే ఎక్కువ ప్రభావం చూపిందని చెప్పొచ్చు. సమకాలీన అంశాలపై మంచి పట్టు, వాగ్ధాటి, సూటిగా ప్రశ్నించే తత్వం.. ఇవన్నీ ఆయన పట్ల సానుకూల ప్రభావాన్ని తీసుకొచ్చాయి. చర్చా కార్యక్రమాలు, సోషల్ మీడియాల్లో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా రఘునందన్ సంధించే వాగ్బాణాలు ప్రజల్ని కొంతమేర ఆకర్షించాయి. మరోవైపు సోషల్ మీడియాలో భాజపా శ్రేణులు విశేషంగా ప్రచారం నిర్వహించాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించాయి. ఆ పార్టీ నేతల దూకుడు కూడా విజయానికి దోహదపడింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన ప్రసంగాలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
కలిసొచ్చిన సానుభూతి
రఘునందన్రావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక శాసనసభ స్థానం నుంచి 2019లో మెదక్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ మూడు సార్లూ ఆయనకు ఓటమి తప్పలేదు. 2014, 2018 ఎన్నికల్లో రఘునందన్పై తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లోనూ రఘునందన్పై తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి గెలుపొందారు. దీంతో ఈ ఉపఎన్నికను రఘునందన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రజలకు సైతం ఆయనపై కొంత సానుభూతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనకు అవకాశమివ్వాలంటూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కోరడం రఘునందన్ కలిసొచ్చింది. మరోవైపు పోలింగ్కు రెండు, మూడు రోజుల ముందు జరిగిన పరిణామాలు కాషాయ పార్టీకి లాభించాయి. సిద్దిపేటలో రఘునందన్ బంధువుల ఇళ్లలో రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు చేయడంతో నగదు పట్టుపడిందంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అక్కడ భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్దేశపూర్వకంగా భాజపాకు ఇబ్బందులు సృష్టించేందుకే అధికార తెరాస ఈ విధంగా వ్యవహరిస్తోందంటూ రఘునందన్ ఆరోపించారు. అదే సమయంలో సిద్దిపేటకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేరుకుని రఘునందన్ను పరామర్శించారు. ఈ క్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడికి చేరుకోవడం.. సిద్దిపేట సీపీతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసి కరీంనగర్ పంపడం తదితర పరిణామాలు ఆ పార్టీపై కొంత సానుభూతి కలిగేలా చేశాయి.
భాజపా విజయానికి కారణాలివేనా!
రఘునందన్రావు అక్కడి ప్రజలకు సుపరిచితులు కావడం, నిరుద్యోగ అంశం, యువ ఓటర్లు ఆయన వైపు వైపు మొగ్గు చూపడం ఉప ఎన్నికలో కీలకాంశాలుగా మారాయి. దుబ్బాకను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. అక్కడ పోల్మేనేజ్మెంట్ పకడ్బందీగా అమలు చేసింది. ప్రజలు కూడా మార్పును కోరుకోవడం రఘునందన్కు విజయాన్ని తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి యువత భాజపా తరఫున ప్రచారం చేయడం కూడా పార్టీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. దీనికి తోడు భాజపా నేతలు అక్కడ పదునైన ప్రచారంతో దూకుడును ప్రదర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకొని మాటల తూటాలతో ప్రజలను తమవైపు ఆకర్షించుకోగలిగారు. తెరాస అభ్యర్థి సుజాత ఆకట్టుకొనేలా మాట్లాడలేకపోవడం.. రఘునందన్ వాక్చాతుర్యం కూడా భాజపా విజయానికి బాగా కలిసొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా కూడా ఉందంటూ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా ఓటర్లను ఆ పార్టీ తమవైపు తిప్పుకోవడంలో పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దుబ్బాకకు చుట్టుపక్కల నియోజకవర్గాలుగా ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లను తెరాస ప్రభుత్వం అభివృద్ధి చేసినా దుబ్బాకను పట్టించుకోలేదంటూ భాజపా చేపట్టిన ప్రచారమూ తెరాస ఓటమికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.