‘కొత్త ఒప్పందం ఆర్టీసీ మనుగడకే ప్రమాదం’
వైకాపా ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చె్న్నాయుడు ఆరోపించారు.
అమరావతి: వైకాపా ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బినామీ ఆస్తుల రక్షణకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని పరోక్షంగా సీఎం జగన్ను ఉద్దేశించి ఆరోపించారు. కొత్త ఒప్పందం ఏపీఎస్ ఆర్టీసీ మనుగడకే ప్రమాదకరమన్నారు. ఆర్టీసీ లక్షకు పైగా కి.మీ కోల్పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని.. కొత్త ఒప్పందంతో ఆర్టీసీతోపాటు కార్మికులు కూడా నష్టపోతారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
కరోనా కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏపీలో 1,61,258 కి.మీ.మేర టీఎస్ ఆర్టీసీ బస్సులు.. తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర ఏపీ బస్సులు నడవనున్నాయి. ఈ అంతర్రాష్ట్ర ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. దీంతో ఈ రాత్రి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభంకానున్నాయి.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
అమరావతి నుంచి సినీ నటి నవనీత్ రాణాకు భాజపా టికెట్
అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ రాణా ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా