రాజధానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో గళం విప్పారు. రాజధానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో గానీ, ఉమ్మడి జాబితాలో లేని రాజధాని తరహా అంశంలో తుది నిర్ణయం తీసుకొనే....
లోక్సభలో గళమెత్తిన తెదేపా ఎంపీ గల్లా
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో గళం విప్పారు. రాజధానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో గానీ, ఉమ్మడి జాబితాలో గానీ లేని రాజధాని తరహా అంశంలో తుది నిర్ణయం తీసుకొనే అర్హత 248 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ఆయన లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే నిధులిచ్చిందన్న ఆయన.. ఇప్పుడు తమకు సంబంధంలేదంటే ఆ సొమ్ములకు, ప్రజలకు జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాలూ ఇలా చేస్తే పరిస్థితేంటి?
రాజధాని అంశం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలో ఎక్కడా లేకపోవడంతో గందరగోళం తలెత్తిందని పేర్కొన్నారు. ఈ తరహా అంశాల్లో తుది నిర్ణయం తీసుకొనేందుకు రాజ్యాంగంలోని 248 అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు. రాజధాని అంశాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంటే ఈ గందరగోళానికి తెరపడుతుందని సూచించారు. అలా చేయకపోతే ఏపీ ప్రభుత్వ విధానాన్ని ఇతర రాష్ట్రాలూ అనుసరించే అవకాశం ఉందని, అప్పుడు అలాంటి నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోలేని పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె